విద్యార్థులు క్రీడలతో పాటు విద్య లో ను ముందుండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. 

Spread the love

విద్యార్థులు క్రీడలతో పాటు విద్య లో ను ముందుండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.

బుధవారం వికారాబాద్ జిల్లాలోని శివ రెడ్డి పేట (అనంతగిరిపల్లి) సాంఘిక సంక్షేమ గురుకుల బాలల పాఠశాల/కళాశాల ఆవరణలో 10 వ జోనల్ స్థాయి పోటీలలో పాల్గొనే క్రీడాకారులతో మాట్లాడారు . వివిధ పాఠశాలల విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ ద్వారా కలెక్టర్ గారికి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కలెక్టర్ క్రీడాకారులతో మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలతో పాటు చదువులో ముందుండాలని, క్రీడల వల్ల శారీరక దృఢత్వం తో పాటు మానసికంగా బలపడతారని అన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులు గెలుపొంది జిల్లా కు మంచి పేరు తీసుకురావాలని , విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలాన్నారు. క్రీడల్లో తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. క్రీడల్లో రాణించినట్లయితే ఉద్యోగల్లో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని అన్నారు

ఈ కార్యక్రమంలో తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకేర్ ప్రసాద్ ,సాంఘిక సంక్షేమ గురుకుల బాలల పాఠశాల/కళాశాల కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల సాంఘిక సంక్షేమ గురుకుల బాలల పాఠశాల ల విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

. ———————————————————————————————జిల్లా పౌర సంబంధాల అధికారి వికారాబాద్ చే జారి చేయబడినది.