మావోయిస్టు జాతీయ కార్యదర్శి, నంబాల కేశవరావు, బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి

Spread the love

మావోయిస్టు జాతీయ కార్యదర్శి, నంబాల కేశవరావు, బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి

ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలి

ఆదివాసులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలి

CPM మరియు CPI(ML) న్యూ డెమోక్రసీ వికారాబాద్ జిల్లా పార్టీల డిమాండ్
——————————————————————
జై భీమ్ న్యూస్ టుడే: (వికారాబాద్ జిల్లా ) : CPM మరియు CPI (ML) న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా ఎన్టీఆర్ చౌరస్తాలో ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా మరియు మావోయిస్టుల ఎన్కౌంటర్ లను నిరసిస్తూ నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా CPM పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్. మైపాల్ మరియు CPI(ML) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై మహేందర్ లు మాట్లాడుతూ బుటకపు హత్యలు చేసి ఆదివాసి అమాయక ప్రజలను మరియు మావోయిస్టు నాయకులను ఆపరేషన్ కగారు పేరుతో దాదాపు 500 మంది పైగా ఎన్కౌంటర్ల పేర్లతో మారణ కాండం సృష్టిస్తూ దేశంలో రాజ్యాంగపు హక్కులను కాల రాస్తున్న బిజెపి ప్రభుత్వం తమ యొక్క చర్యలను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ చంపిన 28 మందిలో చతిస్గడ్ రాష్ట్రం అబూజ్ మడ్ అడవుల్లో ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీలను, మావోయిస్టు సానుభూతిపరులను అత్యంత క్రూరంగా హత్య చేశారని తెలిపారు. నిన్న సాయంత్రం మావోయిస్టు జాతీయ కార్యదర్శి కేశవరావును నిరాయుదుడిగా పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ కథలల్లుతున్నారని, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అడవి సంపదను ఇతర దేశాలకు తరలించడంలో భాగంగా నే ఆదాని, అంబానీలకు మూకుమ్మడిగా అడవిని, అడవిలో ఉన్న సంపదలను కట్టబెడుతున్నారని, అందులో భాగంగానే ఈ నరమేధం జరుగుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్, కొండగావ్, జిల్లాలతో పాటు తెలంగాణలో కర్రిగుట్ట తదితర అడవులను జల్లెడ పట్టి ఆదివాసీలను హహనం చేయడం అత్యంత దుర్మార్గ చర్య అని అన్నారు. వెంటనే ఆపరేషన్ కగారును విరమించుకోవాలని, ఇప్పటికే మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ శాంతి చర్చలు జరుపకుండా కేంద్ర బలగాలతో ఏకపక్షంగా కాల్పులు జరిపి హత్య చేయడం సరైనది కాదని అన్నారు. దేశంలో బిజెపి మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ టెర్రరిస్టులతో చర్చలు జరిపి యుద్ధాన్ని విరమించింది కానీ, స్వదేశంలో పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడుతున్న మావోయిస్టులతో చర్చలకు మాత్రం సిద్ధంగా లేదని ఎద్దేవా చేశారు. తక్షణమే వారితో శాంతి చర్చలు జరపాలని, ఆదివాసీల హననాన్ని ఆపాలని, ఇప్పటివరకు జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో CPM ,CPI(ML) న్యూ డెమోక్రసీ నాయకులు సుదర్శన్ , ,మల్లేష్ ,యాదయ్య ,దశరథ ఆనంద్, ప్రకాష్ ,నర్సింహులు ,పెంటన్న అనంతయ్య , నాయకులు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.