- తాండూర్ లో అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోండి.
- జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్
- చైతన్య కళాశాల గుర్తింపును రద్దు చేయాలి
- జిల్లా ఇంటర్మీడియట్ న్యూడల్ ఆఫీసర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి
- ఆల్మస్ యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
జై భీమ్ న్యూస్ టుడే: (వికారాబాద్ జిల్లా): PDSU(ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం) జిల్లా కమిటీగా ఆధ్వర్యంలో తాండూర్ డివిజన్లో గల అనుమతులేని ప్రైవేటు పాఠశాలలపై మరియు కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోమవారం నాడు ప్రజావాణిలో PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో గల శ్రీ చైతన్య బ్రాంచ్ టు పేరు మీద సాయిపూర్ లో నడపబడుతున్న స్కూలుకు ఎటువంటి అనుమతులు లేవు, కానీ యదేచ్ఛగా అడ్మిషన్లు ప్రారంభించి గత సంవత్సరం నుండి నడిపిస్తూ అధిక ఫీజులను వసూలు చేస్తూ ఉన్నారు. దానితోపాటు ఆల్మస్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు మీద స్థానిక అపోల పార్కు ప్రక్కన ఎటువంటి అనుమతులు లేకుండా నడిపిస్తూ ఉన్నారు. వీటితోపాటు స్కూల్ అనుమతి ఒక పేరు మీద ఉంటే మరొక పేరు మీద నడుపుతున్న పాఠశాలలపై, షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా , ఎటువంటి అనుమతులు లేకుండా నడపబడుతున్న అభ్యాస్ స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇట్టి విషయంపై స్థానిక సబ్ కలెక్టర్ గారికి మరియు ఎంఈఓ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని దానితోపాటు TH జూనియర్ కళాశాల ఎటువంటి అనుమతి లేకుండా సంవత్సరం పాటు నడిపి , ఎగ్జామ్ దగ్గర రాగానే చైతన్య కళాశాలతో విద్యార్థులను ఫార్వర్డ్ చేయించారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ను మరియు విద్యార్థులను మోసం చేసిన TH జూనియర్ కళాశాల యజమాన్యంపై అదేవిధంగా చైతన్య కళాశాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేయడం జరిగింది.
More Stories
దొంగ ర్యాంకులతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల పైన చీటింగ్ కేసు నమోదు చేయాలి
విద్యారంగానికి 20%శాతం నిధులు కేటాయించలేదు అంటే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వర్యం చేయడంకోసమే —-PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్
తాండూర్ లో అనుమతి లేని ఆల్మస్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు మీద నడుపుతున్న యజమాన్యం పై చర్యలు తీసుకోవాలి