
నీట్-యూజీ 2024 కోసం నిర్వహించిన పరీక్షలో కొందరు కాపీ కొట్టారని వేసిన కేసును గతంలో సుప్రీం కోర్టు కొట్టివేసింది. అయితే ఆ కేసులో నిజంగానే లోపలు ఉన్నాయని…మరోసారి పున:సమీక్షించాలని ధర్మసనంలో రివ్యూ ఫిటిషన్ నమోదు అయ్యింది. కానీ, అన్ని పరిశీలించిన అత్యున్నత న్యాయ స్థానం రివ్యూ పిటిషన్ను తోసిపుచ్చింది.
నీట్ పేపర్ లీక్..
దేశంలోని వైద్య విద్యార్థులందరి కోసం ప్రత్యేకంగా నిర్వహించే పోటీ పరీక్ష NEET. ఈ పరీక్ష ద్వారానే MBBS,BDS,ఆయుష్, ఇతర వైద్య సంబంధిత కోర్సుల్లో విద్యార్థులు ప్రవేశం పొందుతారు. ఈ సంవత్సరం మే 5న నిర్వహించిన NEET-UG 2024కి 23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఈ పరీక్షలో కొందరు మాల్ ప్రాక్టీస్, ఇతర సాంకేతికతను ఉపయోగించి కాపీ కొట్టారని కోర్టులో కేసు నమోదు అయ్యింది. దేశ వ్యాప్తంగా జరిగిన పరీక్ష కావడంతో గత మే, జూన్ నెలల్లో పెనుదుమారం రేగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేశారు.
More Stories
మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న అందాల పోటీలను బహిష్కరించండి! మహిళలను మార్కెట్ వస్తువుగా దిగజారుస్తున్న అందాల పోటీలను రద్దు చేయాలి!
కర్రెగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధాన్ని వెంటనే ఆపాలి, ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీలతో శాంతి చర్చలు జరపాలి.. వామపక్ష పార్టీలు ,ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల డిమాండ్
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తో సమావేశం అయిన శాంతి చర్చల కమిటీ నేతలు.