మల్టీ స్పెషాలిటీ పేరుతో కొనసాగుతున్న వికారాబాద్ మెడి క్యూర్, పరిగి సాధన పైన మరియు కనీస సౌకర్యాలు లేని హాస్పిటల్స్ పైన చర్యలు తీసుకోవాలని DMHO కు వినతి పత్రం అందజేసిన AIKMS జిల్లా నాయకులు
వికారాబాద్ జిల్లా: (జై భీమ్ న్యూస్ టుడే): ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలి సంఘం (AIKMS) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై మహేందర్ , బి మల్లేష్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో కార్పొరేట్ పేరుతో రోజుకొక హాస్పిటల్ దర్శనమిస్తూ కనీస సౌకర్యాలు కూడా లేకుండా మల్టీ స్పెషాలిటీ పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారు అత్యవసరం పరిస్థితిలో హాస్పిటల్స్ ముందు వాహనాలు నిలపడానికి కనీసం పార్కింగ్ సౌకర్యం కూడా లేకుండానే అనుమతులు పొందుతున్నారు ఒక ల్యాబ్ లో నిర్వహించిన పరీక్ష రిపోర్టులు మరొక హాస్పిటల్లో చెల్లవు మళ్లీ వాళ్ల వద్ద టెస్టులు చేయించుకోవాలి అడిగినంత ఫీజు ఇవ్వాలి మందులు కూడా అక్కడే కొనాలి హాస్పిటల్ పర్మిషన్ ఒక డాక్టర్ పేరు మీద ఉంటే మరో డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు అవసరం ఉన్నా లేకపోయినా రకరకాల పరీక్షలు చేసి బిల్లులు వేసి ఫీజులు దండుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్ లో పైన చర్య తీసుకోవాలని అన్నారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికూర్ హాస్పటల్ కు కనీసం పార్కింగ్ కూడా లేకపోయినా ఆరోగ్యశ్రీ సేవలు మంజూరు చేయడం విచారకరం అన్నారు పరిగి సాధన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హైవే ఫుట్పాత్ పైన ఉంది కనీసం పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పాటు ప్రాణాలు పోతున్న వైద్య అధికారులు పట్టించుకోకపోవడం లేదు అన్నారు జిల్లాలో ఈ రకంగా ఫీజులు దండుకుంటున్న హాస్పిటల పైన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు జి రాములు , యాదయ్య , నర్సింలు పాల్గొన్నారు.
More Stories
“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
నిబంధనలకు వ్యతిరేకంగా భాష్యం సంకల్ప్ అకాడమీ కోచింగ్ A/C క్యాంపస్ పేరుతో నడుపుతున్న భాష్యం జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
మావోయిస్టు జాతీయ కార్యదర్శి, నంబాల కేశవరావు, బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి