తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునేలా ప్రభుత్వంతో చర్చలు జరపండి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు ఈడిగీ సంజయ్ గౌడ్ MLA కూనంనేని సాంబశివరావు గారికి వినతి పత్రం అందజేత
——————————————————————–
జై భీమ్ న్యూస్ టుడే, తాండూర్ : కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారిని తాండూరు పర్యటనలో భాగంగా వారిని కలిసి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు ఈడిగీ సంజయ్ గౌడ్ MLA కూనంనేని సాంబశివరావు గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలియజేయడం జరిగింది. దానితోపాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా 250 చదరపు గజాల ఇంటి స్థలం , నెలకు 25 వేల పెన్షన్ మరియు వారికి హెల్త్ కార్డు దానితోపాటు బస్ పాస్ , ఇతర ప్రభుత్వ పథకాలు వర్తించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం తమ వంతు కృషి చేయాలని తెలియజేయడం జరిగింది.
More Stories
“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు సంజయ్ గౌడ్
పాత తాండూర్ ఫ్లైఓవర్ ఆలోచన విరమించుకోవాలి